ఉపాధ్యాయుల సేవలు దేశానికి ఎంతో అవసరం : సీఎం

5 Sep, 2017 12:08 IST|Sakshi
ఉపాధ్యాయుల సేవలు దేశానికి ఎంతో అవసరం : సీఎం
హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల జీవితంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమైందని, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో టీచర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని సీఎం అన్నారు.
మరిన్ని వార్తలు