కేసీఆర్ అసమర్థతతోనే రైతు ఆత్మహత్యలు

16 Nov, 2014 01:12 IST|Sakshi
  • టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ
  • కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ విమర్శిం చారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 56 మంది రైతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున చెక్కులను శనివారం జిల్లా కేంద్రంలో అందించారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులతో కలసి కలెక్టరేట్‌కు వెళ్లారు.  

    కలెక్టర్ బయటకు రావాలంటూ ఆయన చాంబర్ ముందు ధర్నా చేశారు. కలెక్టర్ రాకపోవడంతో ఎర్రబెల్లి, రమణ తదితరులు లోనికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని వినతిపత్రం సమర్పించారు.
     

మరిన్ని వార్తలు