సింగపూర్ బయల్దేరిన సీఎం కేసీఆర్

19 Aug, 2014 22:14 IST|Sakshi
సింగపూర్ బయల్దేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తొలిసారి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. మంగళవారం రాత్రి కేసీఆర్ సింగపూర్కు బయల్దేరివెళ్లారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్తో పాటు సింగపూర్ ప్రధాని కూడా హాజరవుతారు.

సింగపూర్ వెళ్లే ముందు కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. మార్కెటింగ్ తెలంగాణ కోసం సింగపూర్ వెళ్తున్నానని చెప్పారు. కేసీఆర్ సింగపూర్తో పాటు మలేసియాను కూడా సందర్శించనున్నారు. ఇదిలావుండగా సమగ్ర సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు