కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి మృతి

18 Jun, 2014 08:56 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల సంతోష్ కుమార్ మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున 1.30గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పెండ్యాల సంతోష్‌ కుమార్ వారం రోజుల క్రితమే నియమితులయ్యారు. ఆయన మృతికి కేసీఆర్ సంతాపం తెలిపారు.

 

మరిన్ని వార్తలు