సీఎం సైకత శిల్పం

14 Dec, 2018 00:47 IST|Sakshi

కురవి: సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో సాధించిన విజయానికి గుర్తుగా ఓ కళాకారుడు ఆయన సైకత శిల్పాన్ని రూపొందించాడు. సైకత శిల్పాలు తయారు చేయడంలో దిట్ట అయిన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన కళాకారుడు, లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు గ్రహీత నీలం శ్రీనివాసులు ఎన్నికల్లో కేసీఆర్‌ 88 సీట్లు సాధించడంతో ‘కేసీఆర్‌ ద సన్‌ ఆఫ్‌ తెలంగాణ ఎట్‌ ద రేట్‌ ఆఫ్‌ 88 ’అనే టైటిల్‌తో ఈ సైకత శిల్పాన్ని తయారు చేశాడు. దీని తయారీకి 40 గంటల సమయం పట్టిందని శ్రీనివాసులు తెలిపారు. ఈ సైకత శిల్పాన్ని ఎలాగైనా కేసీఆర్‌కు అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. సైకత శిల్పాన్ని తయారు చేసిన శ్రీనివాసులును గ్రామస్తులు అభినందించారు.  

మరిన్ని వార్తలు