నేడు నల్గొండలో కేసీఆర్ పర్యటన

8 Jun, 2015 08:01 IST|Sakshi
నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దామరచర్లలో ఏర్పాటు చేయనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైలాన్‌తో పాటు, చౌటుప్పల్‌లో వాటర్ గ్రిడ్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 
 
మరిన్ని వార్తలు