చిన్నారిని చిదిమేసిన స్కూలు బస్సు

19 Jun, 2015 17:13 IST|Sakshi

మిర్యాలగూడ: నిన్ననే బడిబాట పట్టిన ఓ చిన్నారిని స్కూలు బస్సు చిదిమేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్నారి హాసినిని తల్లిదండ్రులు గురువారమే స్కూళ్లో చేర్పించారు. ఆ మరుసటి రోజే ప్రమాదవశాత్తూ  విద్యార్థిని హాసిని స్కూలు బస్సు కింద పడింది. దీంతో హాసిని అక్కడిక్కడే మృతిచెందింది. దీంతో ఆ బాలిక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని వార్తలు