'కొలువుల కొట్లాట' కు మద్దతు ఇవ్వండి

1 Dec, 2017 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొలువుల కొట్లాట పేరిట టీజేఎసీ నిర్వహించునున్న సభకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను టీజేఓసీ చైర్మన్‌ కోదండరాం కోరారు. ఆయన ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, టీపీసీసీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4 న సరూర్‌ నగర్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో కొలవుట కొట్లాట సభ జరగనుందని ఆయన తెలిపారు. కాగా కొలువులకై కొట్లాట సభకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు