కోదండరాంకు తృటిలో తప్పిన ప్రమాదం

6 Jun, 2014 16:02 IST|Sakshi
కోదండరాంకు తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోదండరాం ప్రయాణిస్తున్న కారును ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కీసర సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి కోదండరాం క్షేమంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది.

మరిన్ని వార్తలు