'ఏసీబీ దాడిలో కుట్ర కోణం'

22 Jan, 2017 12:27 IST|Sakshi
'ఏసీబీ దాడిలో కుట్ర కోణం'

నిజామాబాద్‌: అవినీతి నిరోధక శాఖాధికారుల దాడిలో కుట్ర కోణం కనిపిస్తోందని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ ఏసీబీ అధికారులకు చిక్కి ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు.

చదవండి :  (అవమాన భారం ఉసురు తీసింది! )

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర్లు చాలా నిజాయితీ పరుడని కావాలనే ఈ కుట్రలో ఇరికించారన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించి వెంకటేశ్వర్లు కుటుంబసభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు