ప్రమాదకరంగా పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే : కోన వెంకట్‌

26 Sep, 2019 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ యువతి మరణించటంతో మెట్రో, ఫ్లై ఓవర్‌ల నిర్మాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్‌ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పిల్లర్‌ నంబర్‌ 20 వద్ద ఉన్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ప్రమాదకరంగా పెచ్చులు ఊడిపోయిన ఫ్లై ఓవర్‌ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన కోన వెంకట్‌.. కేటీఆర్‌, తో పాటు జీహెచ్‌ఎంసీలకు ట్యాగ్ చేశారు. మరి కోన ట్వీట్‌ అధికారులు ఎలా స్పదింస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు