అమాత్యుల రాక

12 Apr, 2015 01:59 IST|Sakshi

నేడు జిల్లాకు కేటీఆర్, లక్ష్మారెడ్డి
 
హన్మకొండ అర్బన్ : జిల్లాకు ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రానున్నారు. ఆయన ఉదయం 9.30 గంటలకు పరకాల మండలం వరికోలు చేరుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పరకాల, నర్సంపేటల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. వడ్డేపల్లిలోని పీజేఆర్ గార్డెన్‌లో జరిగే వివాహ వేడుకలకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు వాటర్‌గ్రిడ్‌పై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.వర్ధన్నపేట నియోజకవర్గంలో రూ.30.66 కోట్లతో చేపట్టనున్న రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం హసన్‌పర్తితో ఎమ్మెల్యే ఆరూరీ రమేశ్ ఆధ్వర్యంలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నారుు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రమేష్ పిలుపునిచ్చారు.

ఎంజీఎంకు ఆరోగ్యశాఖ మంత్రి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ఉదయం 10.30 గంటలకు వరంగల్‌లోని ఎంజీఎంను సందర్శిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పీజేఆర్ గార్డెన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు