హైదరాబాద్: 'ప్రజాస్వామ్యం ఖూనీ అ యిందని.. అపహాస్యం పాలైందని.. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా గొడవచేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని దౌ ర్భాగ్యం మన దగ్గరే ఉంది. మన శాసన సభలో ఎలా ప్రవర్తించాలో పక్క రాష్ట్రం సీఎం దగ్గర గెడైన్సు తీసుకుని వస్తున్నారు. ఇంతకంటే దురదృష్టకరం ఏం ఉంటుంది. వలసల మీద గగ్గో లు పెడుతున్న టీడీపీ నేతలు, వైఎస్సార్ కాం గ్రెస్ ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, రుద్రరాజులకు ఎలా పచ్చ కండువా లు కప్పారు...' అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు నిలదీశారు. మరో మంత్రి జగదీశ్రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్లతో కలసి శనివారం ఆయ న టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలను తూ.చా. తప్పకుండాపాటిస్తూ, తెలంగాణ టీడీపీ నేత లు శాసన సభ సమావేశాల్లో రభస చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ మార్పిళ్ల అంశం స్పీకర్, మండలి చైర్మన్ల దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు వాటిపై ఎలా చర్చిస్తారని అన్నారు. ఇక, వీరు అమరవీరుల కుటుం బాల కోసం పోరాడుతామని చెప్పడం హంతకులే సంతాపసభలు పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నప్పుడు జానా, ఉత్తమ్, జీవన్ కేరింతలు కొట్టలేదా? అన్నారు. ‘తెలంగాణ ప్ర జలకు జవాబుదారీగా ఉంటాం. ఏపీ తొత్తులకు జవాబివ్వం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.