సాక్షి, హైదరాబాద్: ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారక రామరావుకు మరో ప్రతిష్టాత్మక పురష్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మంత్రి కేటీఆర్కు ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ( అర్బన్) పట్టణాల్లో హరిత హారం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఈ అవార్డును ఈ నెల 20న ఢిల్లీలో ప్రదానం చేస్తారు. గతంలో ‘స్కోచ్’ సంస్థ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కేటీఆర్కు ప్రదానం చేసింది.