'ఖర్చు ఎంత అయినా పేదలందరికీ పెన్షన్లు ఇస్తాం'

1 Dec, 2014 12:07 IST|Sakshi

హైదరాబాద్:అర్హులైన లబ్దిదారులందరికీ పెన్షన్లు అందించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పెన్షన్లు, వాటర్ గ్రిడ్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందించాలన్నారు. పరిమితులు లేకుండా పేదలందరికీ పెన్షన్లు అందాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమిలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఎంత ఖర్చయినా సరే పేదలందరికీ పెన్షన్లు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.

మరిన్ని వార్తలు