సిద్దిపేటరూరల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో ప్రజల పార్టీగా మారిందని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. టీ అమ్ముకునే దుకాణం వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కమాలరామచంద్రం, ఎంపీటీసీలు, దేవేందర్, ఏకాంభరం, తదితరులు పాల్గొన్నారు.