సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఆస్ట్రేలియాలో 20 రోజులపాటు పర్యటించనున్నారు.
ఈ మేరకు ఆమె ఆదివారం ఆస్ట్రేలియాకు బయల్దే రనున్నారు. 9న సిడ్నీలో గ్లోబల్ ఉమెన్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో న్యూ సౌత్వేల్స్ పార్లమెంట్ హాల్లో లక్ష్మీపార్వతిని వివిధ మహిళా సంఘాలు సన్మానిస్తాయి. 14న మెల్ బోర్న్లోని తెలుగు సంఘాలు, అక్కడి తెలుగు వారు సన్మానించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని 23న ఆమె తిరుగు ప్రయాణమవుతారు.