రోడ్డెక్కిన 12 నూతన బస్సులు

15 Mar, 2016 13:18 IST|Sakshi

ఖమ్మం: ఖమ్మం నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద కేంద్రం కేటాయించిన 12 నూతన బస్సులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నెస్పీ ప్రాంతంలో మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓ బస్సులో మంత్రి తుమ్మలతోపాటు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, కలెక్టర్, ఇతర అధికారులు నగరంలో పర్యటించారు.

మరిన్ని వార్తలు