మంథని మండలం స్వర్ణపల్లిలో బుధవారం ఉప్పుల అశోక్ అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడం, చేసిన అప్పులు తీర్చే మార్గం కనపడక పోవటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.