ఆంధ్రా పార్టీలను వీడండి : ఎంపీ నగేశ్

15 Dec, 2014 02:03 IST|Sakshi
ఆంధ్రా పార్టీలను వీడండి : ఎంపీ నగేశ్

ఆసిఫాబాద్ : తెలంగాణ యువత బంగారు భవిష్యత్తు కోసం ఆంధ్రా పార్టీలను వీడాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సూచించారు. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్‌లోని సందీప్‌నగర్‌లో గల శివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేరు సంఘం ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ నగేశ్ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు.

ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. మేరు సంఘం గౌరవ అధ్యక్షుడు రాపర్తి నారాయణ, అధ్యక్షుడు రాపర్తి శంకర్, సత్తన్న, సురేశ్, నగేశ్, రమేశ్, ఎన్నం కృష్ణ,  ఇస్తారి, కీర్తి రాజన్న, సంఘ సేవ యూత్ అద్యక్షుడు అన్నం అంజయ్య, బీజేపీకి చెందిన రాజేశ్, బజార్ వాడీ యూత్ యువకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆసిఫాబాద్, రెబ్బెన జెడ్పీటీసీలు కొయ్యల హేమాజీ, బాబురావు, రెబ్బెన ఎంపీపీ సంజీవ్, ఎంపీటీసీ మేకల నారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు