తల్లాడ అడవిలో చిరుత సంచారం 

22 May, 2019 02:03 IST|Sakshi

సీసీ కెమెరాలో గుర్తించిన అధికారులు   

తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ అటవీ క్షేత్ర పరిధిలో చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. జాతీయ జంతు గణనలో భాగంగా 2018 జనవరి 24న చిరుత పాదముద్రలను కనుగొన్నారు. ఆ తర్వాత తల్లాడ రేంజ్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం సీసీ కెమెరాలను అడవిలో ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఈనెల 18న చిరుత సంచరించినట్లు సీసీ కెమెరాల్లో ట్రాక్‌ అయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రదేశాన్ని సత్తుపల్లి ఎఫ్‌డీఓ సతీష్‌కుమార్, తల్లాడ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి అరవింద్‌కుమార్‌ తదితరులు మంగళవారం సందర్శించారు. అక్కడ చిరుత పులి సంచారం, కాలి ముద్రలను గుర్తించారు.  

మరిన్ని వార్తలు