ఆకలితో ఉన్నవారిని ఆదుకుందాం: డీజీపీ

28 Apr, 2020 03:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ దెబ్బకు పలు వ్యాపారాలు, పనులు నిలిచిపోయాయి. రోజుకూలీలు డబ్బుల్లేక తినీతినక పస్తులుంటున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు పరిచయం అక్కర్లేదు. ఈ విపత్తు వేళ సాటి మనిషి కడుపు నింపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం’ అని ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు