కార్పొరేట్‌ కాలేజీల్లో ఆత్మహత్యలపై హైకోర్టుకు లేఖ

23 Jan, 2018 02:13 IST|Sakshi

లేఖపై స్పందించిన హైకోర్టు.. పిల్‌గా పరిగణన

నేడు విచారణకు వచ్చే అవకాశం

సాక్షి,  హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు కార్పొరేట్‌ కాలేజీలు, ఐఐటీల్లో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు ఆయా కాలేజీల యాజమా న్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తమకు అందిన లేఖపై హైకోర్టు స్పందించింది. ప్రకాశం జిల్లాకు చెందిన లోక్‌సత్తా అజిటేషన్‌ సొసైటీ జిల్లా కన్వీనర్‌ దాసరి ఇమ్మాన్యుయేల్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజ న వ్యాజ్యం (పిల్‌)గా పరిగణిం చింది.

ఇందులో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, హోం, విద్యాశాఖ ల ముఖ్య కార్యదర్శులు, ఇంటర్‌ బోర్డు కార్యదర్శు లు, నిమ్స్, స్విమ్స్‌ డైరెక్టర్లతో పాటు, కార్పొరేషన్‌ కాలేజీలైన నారాయణ, శ్రీచైతన్య కాలేజీల యాజమాన్యాలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిల్‌పై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. 

>
మరిన్ని వార్తలు