సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

30 Sep, 2017 04:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌–2018 శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌.లక్ష్మణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు  http://studycircle.cgg.gov.in/tstw వెబ్‌సైట్‌లో జాబితాను చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్‌ 3న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం హిమాయత్‌ సాగర్‌ రోడ్‌లోని మానస హిల్స్‌ వైటీసీలో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు. శిక్షణా తరగతులు అక్టోబర్‌ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇతర వివరాలకు 040–27540104, 7799886980, 8522914704 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు