లారీ, బైక్ ఢీ: వ్యక్తి మృతి

23 Aug, 2015 18:11 IST|Sakshi

ధన్వాడ: మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం పెద్దచింతకుంట కల్వర్టు వద్ద ఆదివారం మధ్యాహ్నాం ఎదురెదురుగా వచ్చిన లారీ, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు