చెరకు లారీ బోల్తా..

27 Nov, 2015 19:06 IST|Sakshi

నారాయణఖేడ్ (మెదక్) : వేగంగా వెళ్తున్న చెరకు లారీ లోడు ఎక్కువవడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా కొట్టింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని మంగల్‌పేట్ గ్రామ హనుమాన్ మందిరం వద్ద 50వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మానూరు నుంచి నిజామాబాద్ వెళ్తున్న చెరకు లారీ మందిరం సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లారీ కింద ఎవరైనా ఇరుక్కున్నారేమో అనే విషయం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు