ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని.. సెల్‌టవర్‌ ఎక్కి

21 Feb, 2019 07:10 IST|Sakshi
సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

మదనాపురం (కొత్తకోట): ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ సృష్టించాడు. ఈ సంఘటన బుధవారం మదనాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీధర్‌ తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని బుధవారం స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌టవర్‌ ఆత్మహత్యకు పాల్పడుతానని బెదిరించాడు. దీంతో ఈ విషయం గ్రామం మొత్తం వ్యాపించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

తోటి స్నేహితులు, తల్లిదండ్రులు ఎంతనచ్చజెప్పినా యువకుడు వినిపించుకోకుండా సెల్‌టవర్‌పైనే భీష్మించి కూర్చున్నాడు. చివరికి పోలీసులు రంగప్రవేశం వచ్చి నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో స్నేహితులు, పోలీసులు నీవు ప్రేమించిన యువతితోనే పెళ్లి చేయిస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు కిందకి దిగాడు. అనంతరం పోలీసులు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

మరిన్ని వార్తలు