ప్రాణం తీసిన ప్రేమ

25 Jan, 2015 18:23 IST|Sakshi
ప్రాణం తీసిన ప్రేమ

వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంలోని ఉరుసు సుభాష్ నగర్ కాలనీకి చెందిన పి. వెంకటేశ్వర్లు (25) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ప్రేమించిన యువతికి నిశ్చితార్థం జరగటంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఉరి వేసుకున్నాడు.

బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులు, ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించాడు. చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మరిన్ని వార్తలు