తాళి కట్టి.. తప్పుకున్నాడు

26 Jan, 2019 08:55 IST|Sakshi

 ప్రియుడి తీరుపై ప్రియురాలి ఆందోళన 

కోరుట్ల (కరీంనగర్‌) : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తప్పుకుని మళ్లీ దొంగచాటుగా పెళ్లి చేసుకుని పరారైన ప్రియుడి ఇంటి ముందు కోరుట్ల పట్టణానికి చెందిన ఓ యువతి ఆందోళన చేసింది. బాధితురాలు వెల్లడించిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌లో నివాసముండే పసుల శ్రీకాంత్‌(26) అదే ఏరియాలో ఉండే మంద రవళి(23)ని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకుని, తరువాత మొహం చాటేయడంతో మరొకరితో వివాహానికి రవళి సిద్ధమైంది.

ఆ సమయంలో పెళ్లికొడుకును బెదిరించి మళ్లీ రవళిని వివాహం చేసుకుంటానని చెప్పి దొంగచాటుగా తాళికట్టాడు. ఆ తరువాత రవళి అత్తగారింటికి వెళితే వారు బెదిరించడంతో పాటు శ్రీకాంత్‌తో సహా కుటుంబ సభ్యులందరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు శుక్రవారం మహిళా జాగృతి పట్టణాధ్యక్షురాలు మధురిమ అధ్వర్యంలో తన అత్తాగారింటి ముందు ఆందోళన చేసింది.

మరిన్ని వార్తలు