ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

12 Jun, 2019 08:38 IST|Sakshi
పరశురాముడు ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న యువతి   

శ్రీరంగాపూర్‌: మండలంలోని వెంకటాపూర్‌లో మంగళవారం ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి(22) ఇదే గ్రామానికి చెందిన పరశురాముడు(30) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన కులపెద్దలు కులం, గోత్రం ఇద్దరివి ఒకటే కావడంతో వరుసలు కలువదని, ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని ఒప్పంద పత్రాలు రాసుకున్నారు.

అనంతరం యువతికి మరొకరితో పెళ్లి కూడా చేశారు. కానీ ప్రియుడిపై ప్రేమతో పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను వదిలి యువతి పుట్టింటికి వచ్చింది. ప్రస్తుతం పరశురాముడు మరో యువతితో పెళ్లికి సిద్ధపడడంతో తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు 24 గంటల్లో న్యాయం చేయకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు