ప్రేమికుల ఆత్మహత్య

30 Jun, 2016 17:56 IST|Sakshi

రామగుండం (కరీంనగర్ జిల్లా) : రామగుండం మండలం జంగాలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. జంగాలపల్లి గ్రామానికి చెందిన రమేశ్(23), లావణ్య(26)లు గత సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు.

లావణ్యకు తొమ్మిది సంవత్సరాల క్రితం వేరొక వ్యక్తితో వివాహం అయింది. ఎనిమిది సంవత్సరాల వయస్సున ఓ పాప ఉంది. భర్త నుంచి సంవత్సరం క్రితమే విడాకులు తీసుకుంది. ఇంట్లో వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రమేశ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా..లావణ్య నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు