ప్రేమ జంట ఆత‍్మహత‍్య

23 Aug, 2017 13:44 IST|Sakshi
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి సమీపంలోని గుట్ట వద్ద బుధవారం ఉదయం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికులిద్దరూ చెట్టుకు ఉరేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యువతీ యువకుల మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
మరిన్ని వార్తలు