రాష్ట్ర వేడుకగా మహర్షి వాల్మీకి జయంతి

30 Sep, 2017 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్‌ 5న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించాలని, రాష్ట్ర స్థాయిలో వేడుకల నిర్వహణను బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు