కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలి

27 Aug, 2019 11:06 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ కవిత

సాక్షి, మరిపెడ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని ఎంపీ మాలోతు కవిత  అన్నారు. మండల కేంద్రంలోని భార్గవ్‌ఫంక్షన్‌ హాలులో సోమవారం డోర్నకల్‌ నియోజక వర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని.. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించడమే కాకుండా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కలుగుతుందన్నారు. కేంద్రం తమ వద్ద ఉన్న విశిష్ట అధికారాలను ఉపయోగించి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. తెలంగాణ  ప్రాజెక్టులకు కేంద్రం సహాయసహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో   ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మెన్‌ గుడిపుడి నవీన్, టీఆర్‌ఎస్‌ నాయకులు రామసహయం రంగారెడ్డి,  డీఎస్‌ రవిచంద్ర, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు