రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కిడ్నాప్ అయిన వివాహిత కేసు మిస్టరీ వీడింది. కోల్కతాలో బిహార్కు చెందిన కిడ్నాపర్ను సైబరాబాద్ పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివాహితకు విముక్తి కల్పించారు. సోమవారం మధ్యాహ్నానికి ఆ మహిళను హైదరాబాద్కు తీసుకు రానున్నారు. ఆ వివాహిత కుటుంబ సభ్యుల నుంచి డబ్బు డిమాండ్ చేసేందుకు దుండగులు కిడ్నాప్కు పాల్పడిన విషయం తెలిసిందే.