ప్రేమ పేరుతో వంచన

27 May, 2016 20:24 IST|Sakshi

జవహర్ నగర్ (రంగారెడ్డి జిల్లా) : తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి జవహర్ నగర్ పోలీసులను శుక్రవారం ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడ భవానీ నగర్‌కు చెందిన ఓ యువతిని అదే ఊరుకు చెందిన నరేష్(22) అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. తీరా పెళ్లి విషయం అడిగితే.. నీకు నాకు సంబంధం లేదని చేతులెత్తేశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని యువతి అభ్యర్థించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు