సిటీలో మండుతున్న ఎండలు.. వ్యక్తి మృతి!

1 May, 2018 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో సూర్యుడు భగ్గుమంటున్నాడు. గతకొంతకాలంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో నగరంలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట అడుగుపెట్టేందుకు నగరవాసులు భయపడుతున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఉండి బయటకు వస్తున్నవారు.. మండుతున్న ఎండలకు తాళలేక అవస్థలు పడుతున్నారు.

మరోవైపు నగరంలోని కూకట్‌పల్లిలో ఎండదెబ్బకు ఓ వ్యక్తి మరణించాడు. వడదెబ్బకు కుప్పకూలిన అతని వివరాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని.. మృతుడు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు