సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి

2 Jan, 2016 12:21 IST|Sakshi
చివ్వెంల: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న(29) ఈ రోజు ఉదయం ఫోన్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. 
 
మరిన్ని వార్తలు