నిద్రమత్తులో జారిపడి వ్యక్తి మృతి

24 Apr, 2015 07:22 IST|Sakshi

వలిగొండ(నల్లగొండ): నిద్రమత్తులో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని వెల్వర్తి గ్రామానికి చెందిన కె. శ్రీను(38) గురువారం రాత్రి డాబాపై నిద్రించాడు. శుక్రవారం ఉదయం నిద్రమత్తులో పై నుంచి కిందపడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు