ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

2 May, 2015 18:06 IST|Sakshi

నార్మెట్ (వరంగల్ జిల్లా) : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నార్మెట్ మండలం యల్దండ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. యల్దండకు చెందిన రావుల రాజు(21) అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. దీనిపై నార్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు