నేరేడుచర్ల: కూలీ పనులకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన కురుపోతు నగేష్(21) నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నె సమీపంలో కొనసాగుతున్న సాగర్ కాల్వ పనుల్లో పాల్గొంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పనులకు అవసరమైన నీటిని సరఫరా చేసే ట్యాంకర్ ప్రమాదవశాత్తు అతనిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన నగేష్ అక్కడికక్కడే చనిపోయాడు.