ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

25 Jul, 2015 14:58 IST|Sakshi

పాల్వంచ రూరల్ : ఖమ్మం జిల్లా పాల్వంచలోని నవభారత్ ఐ ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామానికి చెందిన కొత్త వెంకప్ప(55)గా గుర్తించారు.

వెంకప్ప తన భార్య సూరమ్మతో కలసి కంటి పరీక్షల కోసం శనివారం ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షల అనంతరం ఆస్పత్రి ముందు ప్రధాన రహదారి దాటే ప్రయత్నంలో ఉండగా... కొత్తగూడెం వైపు నుంచి వచ్చిన భద్రాచలం డిపో బస్సు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడే ప్రాణాలు వదిలాడు.
 

మరిన్ని వార్తలు