రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

19 Oct, 2015 16:16 IST|Sakshi

వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజీవ్‌చౌక్‌లో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కె.చంద్రారెడ్డి (58)గా పోలీసులు గుర్తించారు. పని మీద వనపర్తి పట్టణానికి వచ్చినట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు