ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

27 Nov, 2015 18:21 IST|Sakshi

భువనగిరి అర్బన్ (నల్గొండ జిల్లా) : భువనగిరి మండలం రాయగిరి శివారు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంకటేశ్(25) అనే యువకుడు మృతిచెందాడు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వైపు బైక్‌పై వెళ్తున్న వెంకటేశ్‌ను యాదగిరిగుట్ట నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. వెంకటేశ్ స్వస్థలం భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామం.

మరిన్ని వార్తలు