మద్యం మత్తులో బావిలో పడ్డాడు

14 May, 2016 11:15 IST|Sakshi

ఖమ్మం : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన చెన్నం వెంకటేశ్వర్లు(40) శనివారం ఉదయం మద్యం మత్తులో రహదారి పక్కనున్న బావిలో పడి మృతి చెందాడు. అతిగా మద్యం సేవించిన వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడు.  ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి... అతడిని నూతిలో నుంచి వెలికితీసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు