ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి

17 Feb, 2016 14:44 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్ మండలం మాజిద్‌పూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్యనారాయణ (35) అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా... వాటర్ ట్యాంకర్ లారీ ఢీకొంది. తీవ్ర గాయాలతో అతడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు