దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి

7 Jul, 2017 14:07 IST|Sakshi
మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో దారుణం జరిగింది. పొలానికి వెళ్లి రాత్రివేళ ఇంటికి వస్తున్న దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా భర్త మృతి చెందాడు. గ్రామానికి చెందిన బైండ్ల యాదగిరి(60) తన భార్య బాల్‌రాజవ్వతో కలిసి పొలం వద్దకు వెళ్లారు. రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వీరిపై కర్రలతో దాడిచేశారు.
 
బాల్‌రాజవ్వ తప్పించుకుని గ్రామంలోకి వచ్చి విషయం చెప్పడంతో గ్రామస్తులు సంఘటన స్థలానికి వచ్చేసరికే యాదగిరి మృతి చెంది ఉన్నాడు. సంఘటన స్థలానికి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ ప్రసన్నరాణి తమ సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. 
మరిన్ని వార్తలు