బావను చంపిన బావమరిది

24 Oct, 2015 15:43 IST|Sakshi

ముదిగొండ (ఖమ్మం) : కుటుంబ కలహాల నేపథ్యంలో బావ బావమరుదులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో బావ మరిది కర్రతో బావ తలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం దండసిరి గ్రామంలో శనివారం జరిగింది.

గ్రామానికి చెందిన బావ, మరుదులు ఎర్గి వెంకటరత్నం(38), శ్రీనుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో శ్రీను కర్రతో వెంకటరత్నం తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

మరిన్ని వార్తలు