ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తున్నాయని..

16 May, 2017 18:25 IST|Sakshi

బాన్సువాడ(కామారెడ్డి జిల్లా): బాన్సువాడ సిండికేట్ బ్యాంకు ఏటీఎం వద్ద ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తి వద్ద చాకచక్యంగా డబ్బులు దోచేశారు. స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం వద్దకు వచ్చాడు. ఆ వ్యక్తి డబ్బు రూ.60 వేలు డ్రా చేసిన వెంటనే అక్కడున్న ముగ్గురు వ్యక్తులు ఇటీవల ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తున్నాయి ఒకసారి ఇవ్వండి చెక్‌చేద్దాం అన్నారు. చేతికి ఇవ్వగానే ముగ్గురూ 60 వేల రూపాయల్లో 30 వేల రూపాయలు కాజేశారు.

ఈ దృశ్యం ఏటీఎంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు