రోడ్డుపై ఉమ్మిన వ్యక్తిపై కేసు నమోదు

18 Apr, 2020 10:22 IST|Sakshi
ఉమ్మిపై మట్టిపోస్తున్న వ్యక్తి

రంగారెడ్డి, కొత్తూరు: ప్రస్తుతం కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, షాపింగ్‌మాల్స్, బస్టాప్‌ల వద్ద ఉమ్మివేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారి బస్టాప్‌ వద్ద ఉమ్మివేసిన వ్యక్తిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తితోనే ఉమ్మిపై మట్టిని పోయించారు. (తల్లి ప్రేమ)

మరిన్ని వార్తలు